31, మార్చి 2011, గురువారం

ఎవరెన్ని అవరోధాలు కల్పించినామనదే అధికారం : జగన్

వైఎస్ ఖ్యాతిని చరిత్రపుటల్లోంచి చెరిపేసేందుకు పాలక, విపక్షాలు ఏకమై కుట్రలు పన్నుతున్నారని మాజీ ఎం.పి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎవరెన్ని అవరోధాలు కల్పించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని... రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని పార్టీ వర్గాలకు భరోసానిచ్చారు.