31, మార్చి 2011, గురువారం

ఉగాది నుంచి శివన్న కి ఆర్జిత సేవల కట్

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏప్రిల్ 1 నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఉగాది ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ఈఓ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. గర్భాలయంలో భక్తులు నిర్వహించే రుద్రాభిషేకం, కుంకుమార్చన, రుద్ర, చండీ యాగాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.ఉత్సవాలు జరిగే ఐదు రోజులూ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు.