19, మే 2011, గురువారం

వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతులకు ఏ సమ్యల వచ్చినా సత్వరమే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా...రైతుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలు అర్థం లేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పితాని సత్యనారాయణ ఎద్దేవా చేశారు. వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబుకు రైతాంగం, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. త డిసెంబరులో సంభవించిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. మరో వారం రోజుల్లో ఈ ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.