19, మే 2011, గురువారం

రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు

రైతు సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే నిమిత్తం గురువారం తెలుగుదేశంపార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. రైతు సమస్యలను పరిష్కరించాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మహబూబ్‌నగర్‌జిల్లాలోని మరికల్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని దేవరకద్ర మార్కెట్‌యార్డును పరిశీలించి, అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.