19, మే 2011, గురువారం

విభజిస్తే ఒక ప్రాంతంలోనయినా మనుగడ

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి కోవర్టు అని సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు... ఎంపీ రాజగోపాల్‌రెడ్డి కూడా జగన్‌కు ధన సాయంతో పాటు మనుషులను కూడా సరఫరా చేస్తూ అన్నివిధాలా సాయపడుతున్నారని ఈ ఇరువురి వల్ల జగన్‌కు బలమే తప్ప అధిష్ఠానానికి కాదన్నారు. విభజిస్తే ఒక ప్రాంతంలోనయినా మనుగడ సాగిస్తుందని పాల్వాయి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రులను మార్చి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తప్పుచేసిందని, ఉన్న వారి ద్వారానే సమర్థంగా పనిచేయించుకోవాలని ఆయన సూచించారు.