19, మే 2011, గురువారం

చైనాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న తెలుగు విద్యార్థి సత్య శ్రీనివాసరెడ్డి ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మరో నాలుగు నెలల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు.