19, మే 2011, గురువారం

ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ జర్నలిస్టుల ధర్నా

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణపై బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు గురువారం ఉదయం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ చాఫ్టర్‌ను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఆందోళనకు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.