13, మార్చి 2012, మంగళవారం

నవ భావనల నయాగరాయాచేంద్ర గేయధార!!

  • వండి, వార్చిన అమ్మ స్వయంగా వేడివేడిగా వడ్డించినట్లు...
  • కలమాగిన ఫలాన్ని కోసిన ఫలాన్ని కోసి కొమ్మమీద కూర్చుని తినేటట్లు...
  • తుట్టిలోని తేనెను చెట్టుమీద కూర్చొని జుర్రుకున్నట్లు...
  • అరవిరిసిన మల్లెల మధుర వాసనల్ని తోటలోనే మూర్కొన్నట్లు....
  • సంగీతం, సాహిత్యం, గానం మూడు కళల మేళవింపుగా పుట్టినది గేయధార...
  • నవతను ఆకర్షించే సంగీత ప్రక్రియలో మేటి యాచేంద్ర ...
  • సంగీతంలో గురు ముఖత్వవీ నేర్చుకోకపోయినా తమ సంస్థానంలో శాస్త్రీయ, హిందూస్తానీ, కర్ణాటక సంగీత కచేరీలను వినడం ద్వారా సంగీతాన్ని తనలో జీర్ణించు కుని... తరతరాలుగా తమ కుటుంబీకులలో వస్తున్న సాహిత్య ప్రవీణతని రంగరించుకుని గేయధార ప్రక్రియ కు సృష్టికర్తగా నిలచారు. దిగజారి పోతున్న సంగీత, సాహిత్యాల స్థాయిని నిలబెట్టాలని భావించి.. గేయ కవిత్వంలో సాహితీ ప్రపంచంలో తన కంటూ సము న్నత స్థానం దక్కించుకుని..ఓ నూతన ఒరవడి సృష్ఠిం చాలని, అది సామాన్య జనాళికి అందుబాటులో ఉండా లనే పరవెూద్దేశ్యంతో ప్రారంభించిన వినూత్న సాహితీ ప్రక్రియే సంగీత గేయధార అని చెప్తారు యాచేంద్ర.
    సంగీత, సాహిత్య, నృత్య కళలకు పుట్టినిల్లు అయిన వేంకటగిరి సంస్థానంలో 1952 జనవరి 21న జన్మించిన యాచేంద్ర సాయిక్రిష్ణ యాచేంద్ర బాల్యం నుండి సంగీత సాహిత్యాలపై మక్కువ ఎక్కువ... ఆ క్రమంలోనే ఆయన మద్రాసు విశ్వ విద్యాలయంలో ఎం.ఏ. పట్టాను మహాభారతం లో శ్రీకృష్ణుని పాత్ర అనే అంశంపై పరిశోధనలు గావించి తెలుగులో డాక్టరేట్‌ పట్టా పొందారు. సాహిత్యంలో, సంగీతంలో గురువుల వద్ద ఎటువంటి విద్య నభ్యసించని ఆయన సంగీత విద్వాం సులు గాన కచేరీలు అలరించి, సంగీత పరిజ్ఞానాన్ని సంపాదించి పాటలకు, గీతాలకు బాణీ కూర్చాలన్న విధానాన్ని నేర్చుకుని... తన రచనా కాంక్షకు సంగీతాన్ని జోడించి సాహితీరంగంలో సరికొత్త ఒరవడిని ప్రవేశ పెట్ట్టాలని... భావించారు.
    అప్పటికే కొన్ని వందల పాటలు వ్రాసి ప్రసిద్ధ గాయనీ, గాయకుల చేత పాడించిన అను భవంతో... 20సంవత్సరాలు ప్రసిద్ధ సినీ సంగీ త దర్శకులతో చేసిన సహచర్యం కలసి వచ్చి విశేష ప్రాచుర్యమైన సంగీత గేయధారకు రూపకల్పన చేసారాయన...ఎంతమందితో పని చేసినా కూడా రచనలో డా్ప్పసి.నారాయణ రెడ్డి, గానంలో సుశీల, స్వరకల్పనలో డా్ప్పరాజేశ్వరరావులు గురుతుల్యురని వినమ్రతతో చెప్తారు యాచేంద్ర.
    బోలెడు పాటలు
    ఆణిముత్యాల్లాంటి అనేక భక్తి పాటలను... జనం పాడుకునే సాధారణ పదాలతో జానపదాలను రాసిన యాచేంద్ర, వాటికి స్వరరచన కూడా సమకూర్చి పి.సుశీల, ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం, ఎస్‌. జానకి, వి.వి. రామకృష్ణ సుప్రసిద్ద సినీగాయకుల నేతృత్వంలో పాడించగా...ఆ పాటలకు విశేష స్పం దన లభించింది. నేటికీ ఆ పాటలు శ్రోతలను వీనుల విందు చేస్త్తున్నాయంటే... వాటికి లభించిన ప్రచారం ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇవేేగాక మరో వందకు పైగా పాటలను, గీతాలను దూరదర్శ న్‌, ఆలిండియా రేడియోలలో ప్రసారంకాబడ్డాయి. ఈయన రాసిిన అనేక గీతాలలో గీతారాధన అనే పుస్తకం కూడా ముద్రితమై ప్రాచుర్యం పొందింది.
    శాసనసభ్యుడిగా సేవలు...
    1985-89 మధ్య కాలంలో వెంకటగిరి నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా గెలుపొంది రాజకీయాలలో ప్రవేశించిన ఆయన తెలుగుదేశం పార్టీలోనూ ఇటు రాష్ట్ర రాజకీయాలలో ఎంత బిజిగా ఉన్నా తన గేయ ధారని విడువకుండా అనేక కార్యక్రమాల ద్వారా దానిని జనం చెంత కు చేర్చేందుకు కృషి చేసారు. సర్వజనావళికి సంగీత, సాహిత్యాలు అందుబాటులో వుండాలనే సదుద్దేశ్యంతో గేయధార ప్రక్రియని హైదరాబాద్‌, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, విజయవాడ, తెనాలి, నెల్లూరు, శ్రీకాళహస్తి, కడప, రైల్వేకోడూరు తదితర ప్రాంతాలలో వందల ప్రదర్శనలు యిచ్చి ప్రాచుర్యాన్ని పొందారు.
    ప్రదర్శన యిచ్చిన చోట సత్కారాలు అందుకొనుటే కాక, లలిత కవిశేఖరులు, పుంభావ సరస్వతి వంటి బిరుదు సత్కారాలు పొందిన యాచేంద్ర తన గేయధారకు అంతం అంటూ లేదని, ఊపిరి ఉన్నంత వరకు గేయధార ప్రదర్శనలు యిస్తానని చెప్పారు. తాను రాజకీయాలలో ఉన్నా పదవులు అవసరం లేదని, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధి్థనేత స్వర్గీయ యన్‌.టి.ఆర్‌. రాజకీయ గురువు అని, పదవులు ఆశించకుండా ప్రజాసేవ, డబ్బుతో సంబంధం లేకుండా ఖర్చులు భరిస్తే వెళ్లి గేయ ధార కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు. పదవులు ఆశించని ప్రజాసేవ, కాసులు కాంక్షించని కళా సేవ తన జీవిత పరమార్ధమని డా్ప్పవెలుగోటి భాస్కర సాయికృష్ణ యాచేంద్ర ప్రకటించారు.

    ప్రక్రియ సాగేదిలా...
    గేయధార అష్ఠావధానంగా కాదని ఆతరహాలో సాహిత్యానికి సంగీతం మేళవించి సాగే ప్రక్రియని అన్నారు. ఇందులో వస్తు నిర్దేశం, ఇష్ఠపద ప్రయోగం, పదనిషేదం, రాగ, తాళనిర్దేశం, మంచి ముచ్చట్లు. ఇలా ప్రధా నంగా ఐదు అంశాలుంటాయని, వస్తు నిర్ధేశం చేసే వారు చెప్పిన అంశా న్ని పూరిస్తున్న సందర్భంలో మంచి ముచ్చట్లతో యాచేంద్రకు క్షణ క్షణం అడ్డు తగులు తుంటారు. ఈ ముచ్చట్లుకు తృప్తికర సమాధానాలు యిస్తూ సాహిత్యంతో పాటు మరొకరు నిర్ధేశించిన రాగ, తాళాలతో సాహిత్యాన్ని సంగీతపరంగా పూరిస్తారు. తిరుపతిలో నిర్వహించిన గేయధారలో రెండవ దైన ఇష్టపద ప్రయోగంలో పులుపు, కారం చేదు, వగరు అనే పదాలతో తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డులను వర్ణించమని ప్రొఫెసర్‌ వాణి కోరగా యాచేంద్ర తన సాహిత్యంలో వేంకటేశుని వింత రుచులాడు ఇది మేను సిరగలాడు అతడేను అంటూ ప్రారంభించి ఃవలఃపులుపులకరించగా మమఃకారమేః మధురించగా... అంటూ శబ్దాల్ని విరచి అర్థాల్ని సమన్వయ పరచిన తీరు సాయికృష్ణ సాహితీ ప్రజ్ఞ చాటి చెప్పారు. ఈ గీతాన్ని వెూహనరాగం, ఆది తాళంలో సవ్మెూహన రీతిలో ఆల పించిన ఆయన మరొకచోట వంకాయ, టెంకాయ, పిల్ల కాయ, మొట్టికాయ అనే పదాలు ప్రయోగించి ఓ గీతాన్ని కాదంబర రాగం, రూపక తాళంలో ఆలపించమని కోరగా యాచేంద్ర తన సాహిత్యానికి, సంగీతాన్ని జోడిస్తూ
    వంకాయవంటి కూరయూ
    పంకజము వంటి భార్యయూ
    నీకుంటే అదే లోకము
    లేకుంటే భలే శోకం...
    అంటూ జానపద ఊపులో జజ్జనకరి దరువులాంటి పాట అందుకుని కవ్వించే, నవ్వించే కన్నెపిల్ల ఃకాయదాః వెన్నెల ఆ కన్నులోన అంటూ పదాన్ని విరిచి తన ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
    ప్రముఖుల ప్రశంసలు...
    ఒక పద నిషేద అంశంలో సహస్రావధాని డా్ప్పమేడసాని వెూహన్‌ వస్తునిర్ధేశం చేస్తూ కలహ నారదుడు, గీతికా విశారదుడు, కాంతి విజితా పారదుడు అయిన నారదుడు అన్నయ్య తుంబురు డు ఈ గేయధారను చూచి మిమ్ములను ఆశీర్వదించినట్లు, వర్ణించమని ఇందులో ఆరుదెంచె.. దీవించు పదాలు నిషేదం అని మేడసాని అనగా సాయికృష్ణ పులకించి పదాల నిషేదం ఎదు రైనా బెదరకుండా సమయస్ఫూర్తితో, సందర్భానుసారం మరింత సూటి పదాలతో పూరించి శభాషనిపించుకున్నారు.
    ప్రదర్శనలు...
    1995 ఏప్రిల్‌ 5న తేదీన కడప జిల్లారైల్వే కోడూరులో 100వ ప్రదర్శనలో తమ గురువైన డా్ప్పయస్‌. రాజేశ్వరరావు, పి.సుశీల ఆధ్వర్యంలో నిర్వహించిన గేయధార మరపురాదని..ఇదే విధంగా 1996 డిసెంబర్‌ 20వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినా తిరుమల శ్రీవారి ఆస్థాన మండపంలో ప్రదర్శన లు యిచ్చానని చెప్పారు. ఇప్పటి వరకు ఇలా పలు చోట్ల ఎన్నో సంగీత గేయధార కార్య క్రమాలను నిర్వహించి అనేక మంది శ్రోతలను ఆకట్టుకుంటున్న సాయికృష్ణ ఈ ప్రక్రియని పలువురికి పంచేం దుకు సిద్దపడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియని నేర్పించేం దుకు శిష్యగణాన్ని సిద్దం చేసారు.