12, నవంబర్ 2010, శుక్రవారం

మనుషులకే వైద్యసేవలు అందించని దానం.. నాకు పశువైద్యం చేస్తాడా?

రోమ్ నగరం తగలబడుతుంటే 'నీరో చక్రవర్తి' ఫిడేలు వాయిస్తూ కూర్చున్నట్టు.. రాష్ట్రంలో ప్రజలు వరదలతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రోశయ్య కాంగ్రెస్ పార్టీ 125 అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించండంటూ పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని టీడీఎల్‌పీ ఉపనేత, ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే వారి గోడు పట్టించుకోకుండా కాంగ్రెస్ ఉత్సవాలు ఘనంగా జరపాలని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. మనుషులకే వైద్యసేవలు కరువవుతుంటే ఆరోగ్యశాఖ మంత్రి దానం నాగేంద్ర నాకు పశువైద్యం చేయాలంటూ విమర్శించడం విడ్డూరంగా మండిపడ్డారు.