12, నవంబర్ 2010, శుక్రవారం

కేసీఆర్ మరో మర్రి చెన్నారెడ్డి

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో మర్రి చెన్నారెడ్డి అని టీడీపీ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు
ఇందిరాగాంధీకి చెన్నారెడ్డి ఉద్యమాన్ని తాకట్టు పెట్టి పదవులు పొందితే నేడు కేసీఆర్ సోనియా గాంధీ కాళ్ళ వద్దకు ఉద్యమాన్ని తీసుకువెడుతూ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

డిసెంబర్ తర్వాత ఉద్యమం ఉధృతమని ప్రకటించిన కెసిఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని కేశవరావు సమక్షంలో అనడం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని ఆ పార్టీ నేతలే ఒప్పుకున్నట్టేనని ఎద్దేవా చేశారు.