12, నవంబర్ 2010, శుక్రవారం

బలో పేతం దిశగా తెలుగుదేశం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలో పేతం చేసే దిశగా తెలుగు దేశం పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యలు అజెండాగా జనం మధ్యకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి. వాడవాడలా, పల్లెపల్లెనా తెలుగుదేశం నినాదంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి.

విద్యార్థి, ఉద్యోగ, ఉపా«ధ్యాయ, కార్మిక, కర్షకుల సమస్యలు పరిష్కరించలేని అసమర్థ ప్ర భుత్వాలుగా ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చరిత్ర పుటల్లో నిలుస్తాయని .... ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలిచేందుకు వాడవాడలా టీడీపీ నినాదంతో ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణ యం తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై రాజీలేని పోరాటం సాగిస్తామన్నారు పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు