28, జనవరి 2011, శుక్రవారం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం

తెలంగాణను ప్రకటించకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం అవు తుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలంతా రచ్చ బండను బహిష్కరించినా ప్రభుత్వం పోలీస్ బలగాలతో రచ్చబండను నిర్వహించే యత్నం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రచ్చబండకు హాజరు కాలే ని పరిస్థితి ఉన్నా ఇంకా బుద్ది రావడం లేదన్నారు. ప్రజల ఛీత్కారానికి గురైనా నాయకులకు పదవుల్లో కొనసాగే హక్కు లేదన్నారు.