28, జనవరి 2011, శుక్రవారం

జగ్గారెడ్డి ఎక్కడ కనిపించినా తరిమికొట్టాలి : తెరాస పిలుపు

తెలంగాణ మాటలతో రాదని, పల్లెపల్లెనా ఉద్యమం తీవ్రతరం చేసి, యుద్ధం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో పాలనను స్తంభింపచేసి, తెలంగాణ వ్యతిరేకులను తమిరికొట్టాలన్నారు.
విద్యార్ధి, యువత ఉద్యమంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకుంటున్నాయని, శ్రీకృష్ణ కమిటీ అంతా బోగసని, కమిటీ సభ్యులు ఆంధ్రనాయకులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి చీడ పురుగులు తెలంగాణకు అడ్డం కి అలంటి వారిని ఎక్కడ కనిపించినా తరిమికొట్టాల''ని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.