28, జనవరి 2011, శుక్రవారం

శ్రీవారి ప్రసాదాల ధరలు పెంపు

తిరుమలేశుని ప్రసాద ధరలను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వడ రూ. 4 నుంచి రూ. 25కి, జిలేబీ రూ.25 నుంచి రూ.70కి, మురుకు రూ.7 నుంచి 30 కి, పోలీ ప్రసాదం రూ.1 నుంచి రూ.20 కి పెంచింది. ముడి సరుకుల ధరలు పెరిగినందువల్లే ధరలు పెంచినట్లు, ధరలు శుక్రవారం నుండి అమలు జరగనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

ధరల పెంపులో లడ్డూను మినహాయించారు. లడ్డూ ధర యధాతథంగా ఉంటుంది.