28, జనవరి 2011, శుక్రవారం

రచ్చబండకు దూరంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు

తెలంగాణా జిల్లాల్లో జరుగుతున్నా రచ్చబండ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరు కావడం లేదు. హాజరైన వారిని అడ్డుకునేందుకు తెలంగాణవాదులు, టీఆర్ఎస్ శ్రేణులు పలుచోట్ల ఆందోళనలకు దిగుతుండటంతో అధికార పార్టికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రచ్చబండకు దూరం గా ఉండిపోయారు.
టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రచ్చబండను బహిష్కరించగా పలు చోట్ల తప్పని స్తితిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరవుతూ ప్రజల నిరసనలు చవిచూస్తున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని బహిస్కరించి చాల చోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించ గా... వి ద్యార్థులు శుక్రవారం నుంచి జరగుటున్న పరీక్షలను బహిష్కరించాలని నిర్ణ యి0చి తమ హాల్ టికెట్స్ చేపేసి నిరసనలు తెలుపుతున్నారు. పలుచోట్ల ధర్నాలు, రాస్తా రోకోలు, కొనసాగుతున్నై.