19, ఫిబ్రవరి 2011, శనివారం

22, 23 తేదీలలో తెలంగాణా బంద్‌

ఈ నెల 22, 23 తేదీలలో బంద్‌కు తెలంగాణా రాజకీయ ఐకాస పిలుపు ఇచ్చింది. సహాయ నిరాకరణలో భాగంగా ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు ఐకాస తీసుకున్న నిర్ణయం మేరకు ఈ బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఐకాస కన్వినర్‌ ఏ కోదండరామ్‌ శనివారం ప్రకటించారు.

ఆ రెండు రోజులు తెలంగాణా ప్రజలంతా ఎలాంటి రాక పోకలు సాగించ కుండా... రోడ్లపైనా, రహదారులపైనా బైటాయింపులు జరపాలని.. రైల్‌ రోకోలు నిర్వహించి రైల్ల రాకపోకల్ని కూడా అడ్డు కోవాలని కోదండరామ్‌ సూచించారు.