19, ఫిబ్రవరి 2011, శనివారం

మరో సెంచరీతో భారత్‌ మెరుపులు

మీర్పూర్‌: మీర్పూర్‌లో ప్రారంభమైన ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పోరులో మరో సెంచరీని భారత జట్టు సాధించింది. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించిన క్రీడాకారుడిగా భారత డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేరు నమోదు చేసుకోగా.. రెండో సెంచరీని వి.కోహ్లీ సాధించాడు. కొహ్లీకి ఇది వన్డేల్లో ఐదో సెంచరీ.