23, ఫిబ్రవరి 2011, బుధవారం

తెలంగాణ నినాదాలతో హోరేత్తిన లోక్‌సభ

తెలంగాణ అంశంపై చర్చ జరపాలంటూ చర్చ జరపాలంటూ టీఆర్‌ఎస్, బీజేపీ ఎంపీలతో పాటు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కూడా స్వరం కలపడంతో తెలంగాణ నినాదాలతో లోక్‌సభ హోరేత్తింది బుధవారం సభ ప్రారంభం కాగానే తెలంగాణ అంశంపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ టీఆర్‌ఎస్, ఎన్డీయే పార్టీలు పట్టుబట్టాయి. జీరో అవర్‌లో ఈ అంశంపై చర్చకు అనుమతిస్తామని స్పీకర్ మీరాకుమార్ హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది.
సభలో గందరగోళం చెలరేగటం, కేసీఆర్, విజయశాంతిలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వెళ్లాడంతో స్పీకర్ మీరాకుమార్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.