23, ఫిబ్రవరి 2011, బుధవారం

జగన్ పై సర్కార్ కక్ష సాధింపు

25 లక్షలమంది విద్యార్థుల భవిష్యత్ కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేస్తున్నారని.. ప్రభుత్వం ఇప్పటికైనా తమ ప్రతినిధులను జగన్ వద్దకు పంపాలన్నారు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్.

ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విషయంలో సర్కార్ కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుందన్నారు..

చంద్రబాబు దీక్ష చేస్తే.. మూడోరోజేపరిగెట్టారు, తెలంగాణా ఎంపీలు దీక్ష చేపట్టిన గంటల్లోనే విరమించేందుకు యత్నించిన సర్కారు జగన్ దీక్ష పై స్పందించటం లేదు సరి కదా.. బొత్స లాంటి మంత్రులు జగన్ దీక్షని ఎద్దేవా చేస్తున్నారని విమర్శించారు కొండా సురేఖ