23, ఫిబ్రవరి 2011, బుధవారం

పెళ్లిళ్లకు ఇంతమంది మాత్రమే హాజరవ్వాలి

పెళ్లిళ్లకు కూడా సరిగ్గా ఇంతమంది మాత్రమే హాజరవ్వాలి అన్న నిబంధన పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ పార్లమెంటులో ఓ ప్రతిపాదన కూడా చేశారు. పెళ్లిళ్లు తదితర ఫంక్షన్లప్పుడు విపరీతంగా ఆహారం వృథా అవుతోందని ఆయన తెలిపారు.

ఇలా వృథా అయ్యే ఆహారాన్ని ఆదా చేయడం వల్ల దేశంలో ఆకలితో బాధపడేవారికి, పేదవారికి అన్నం దొరుకుతుందని భావిస్తున్నామని చెప్పారు. అందుచేత పెళ్లిళ్లకు అతిథుల హాజరుపై పరిమితి విధించాలని భావిస్తున్నామన్నారు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదనను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. దేశంలో ఇంతకన్నా తీవ్రమైన సమస్యలు ఇన్ని ఉండగా ప్రభుత్వం ఇలాంటి పనికిమాలిన విషయాలపై దృష్టి పెట్టడం అసహ్యం గొలిపేదిగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.