27, మార్చి 2011, ఆదివారం

కాలయాపన కోసమే..కమిటీలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్సే ప్రధాన శత్రువని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర కో-కన్వీనర్ విమలక్క విమర్శించారు. ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎంటీబీఎఫ్) కన్వీనర్లుతో తెలంగాణ విషయమై చర్చ అనంతరం ఆమె మాట్లాడుతూ... ఉద్యమాన్ని అణచివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

డిసెంబర్ తొమ్మిది ప్రకటనను వెనక్కితీసుకున్న కేంద్ర మంత్రి చిదంబరం, రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సహకరించారని, దీన్నిబట్టి తెలంగాణ రాష్టస్రాధనకు కాంగ్రెస్ పార్టే ప్రధాన శత్రువని దుయ్యబట్టారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఇప్పటివరకు ఎటువంటి కమిటీలు పనిచేయలేదని చరిత్ర చెబుతోందన్నారు. ఇవి కేవలం కాలయాపన కోసమేనని చెప్పారు.