27, మార్చి 2011, ఆదివారం

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ లోకి తెలంగాణా నాయకుడు?

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ వైపు కాంగ్రెస్ నాయకుల ఆసక్తి పెరుగుతున్నట్లుంది.తెలంగాణ లోని కొన్ని జిల్లాల నాయకులు కూడా జగన్ ను కలవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా నాయకుడు ఎ.ఇంద్రకిరణ్ రెడ్డి ఆదివారంనాడు జగన్ ను కలిశారు. ఇంద్రకిరణ్ రెడ్డి గతంలో జడ్ పి ఛైర్మన్ గా పని చేశారు. తదుపరి 1991లో టిడిపి తరపున లోక సభకు ఎన్నికై, పి.వి.నరసింహారావు ప్రభుత్వాన్ని రక్షించడం కోసం కాంగ్రెస్ వైపు వెళ్లారు. అప్పటి నుంచి కాంగ్రెస్ ఐ లోనే ఉంటున్నారు. తొలుత కోట్ల విజయభాస్కరరెడ్డి అనుచరుడిగా ఉన్న ఈయన తర్వాత కాలంలో రాజశేఖరరెడ్డి అనుచరుడిగా కొనసాగారు.