27, మార్చి 2011, ఆదివారం

పార్టీ ప్రతిష్ట దిగజారిస్తే ఊరుకోను

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చేవిధంగా వ్యకిగత విమర్సలకు సైతం దిగుతున్న నేతలపై తీసుకు నెందుకు వెనుకాడ బోమని పీసిసి చీఫ్ డి.శ్రీనివాస్ స్పష్టం చేసారు. పీసీసీ అధ్యక్షునిగా మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిపై చర్యలు తీసుకోవడం పెద్దపనేమీ కాద ని ...ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో వుంచుకొని చర్య తీసుకోవడానికి సంకోచిస్తున్నామని అన్నారు.


2004లో ఉన్న ఐక్యత 2009 నాటికి పార్టీలో లేదని, ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో వై ఎస్ ఉన్నప్పుడే కన్పించిందని అన్నారు. ప్రస్తుతం అంతా ఐక్యంగా పనిచేయాల్సిన తరుణంలో పార్టీ నేతలు ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు ప్రకటనలివ్వడం భావ్యం కాదని .. దీని వల్ల ప్రజల్లో చులకన భావం కలుగుతుందని పీసీసీ అధ్యక్షుడు డీఎస్ అన్నారు. .