27, మార్చి 2011, ఆదివారం

వికృత రాజకీయాలకు వేదికగా తమిళనాడు

తమిళనాట మక్కల్ శక్తి కట్చిగా ఆవిర్భవించిన లోక్‌సత్తా పార్టీ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టింది.
ఒకప్పుడు సంస్కృతి సంప్రదాయాలకు, సామాజిక ఉద్యమాలకు, ఆత్మగౌరవానికి మారుపేరు తమిళనాడు .. కొ న్నేళ్లుగా
తమిళనాడు వికృత రాజకీయాలకు వేదికగా మారిందని లోక్‌సత్తా పార్టీ జాతీయ కన్వీనర్, ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాట అధికారం కోసం తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు అభ్యర్థులను రంగంలోకి దించామని అన్నారు. ఎన్నికల కమిషన్ పిరికితనానికి పరాకాష్టగా తమిళనాడులో ఉచిత పథకాలు ఉన్నాయని విమర్శించారు. ఉచితాల పై ఎన్నికల కమిషన్ మేలుకోని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వేస్తే నెలకు ఐదు సీసాల మద్యం ఇస్తాం, స్కూటరిస్తాం.. అన్న వాగ్ధానాలు పుట్టుకొచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశా రు.