27, మార్చి 2011, ఆదివారం

చిరంజీవిని ఆహ్వానించి ఏం సాధించిందో ...

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లు నెగ్గడం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సత్తాకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు.. ఎవరు ఎన్ని మాట్లాడినా జగన్ తన దైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారనే సంకేతాలు ఈ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందన్నారు. ఎవరు ఎటువైపు ఉన్నారో తెలుసుకోలేకుండా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు గందరగోళంలో పడ్డాయన్నారు.. జగన్కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నాయకత్వం చిరంజీవిని ఆహ్వానించి ఏం సాధించిందో అర్ధం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.