2, మార్చి 2011, బుధవారం

మళ్లీ దాడులు ప్రారంభించిన తెలంగాణా వాదులు

గాంధేయ మార్గంలో తమ పోరాటం ఉంటుందని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కే. చంద్ర శేఖర్ రావు ప్రకటించినా... తెరాసా శ్రేణులు, తెలంగాణా వాదులు ఆదిశగా పయనిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు సరికదా రోజు రోజుకి ఉద్యమ కారులు రేచ్చిపోతూనే ఉన్నారు. విద్వంసాలకు, దాడులకు దిగుతూనే ఉన్నారు. ఓ యు విద్యార్ధి జెఎసి రైలుని తగలబెడితే... తెరాస ఎమెల్యేలు... అసెంబ్లీ సాక్షిగా సాటి ఎమ్మెల్యే అని చూడకుండా... తమకు అనుకూలంగా మతలాడలేదని దాడికి దిగి, వ్యక్తిగత స్వతంత్రం హరించేలా ప్రవర్తించిన ఘటనలు మరువక ముందే... మరోమారు సినిమా ఇండస్ట్రీ పై దాడులకి తెరదీయగా.. కాంగ్రెస్ ఎంపి కావూరి ఇంటిపై తెలంగాణా న్యాయ వాదులు దాడిచేసి విద్వంసానికి తెగబడ్డారు.

బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు సమీపంలో జరుగుతున్న అల్లరి నరేష్ సినిమా షూటింగ్‌ను తెలంగాణవాదులు అడ్డుకుని సెట్స్‌ను ధ్వంసం చేశారు. దాంతో షూటింగ్‌కు ఆటంకం ఏర్పడింది. షూటింగ్‌ను తెలంగాణావాదులు లో సృష్టించిన భీభత్సానికి యూనిట్ సభ్యులు హడలి పోయి ప్రాణాలు అరచేత పెట్టుకొని పరుగులు తీసారు.

ఈ నెల 5 న సమైక్య వాదుల సమావేశానికి వేదికగా నిలవనున్నఎంపి కావూరి సాంబశివరావు ఇంటిని తెలంగాణ న్యాయవాదులు ముట్టడించారు. ఇంటిబైట ఉన్న పూల మొక్కల్ని చిందర వందర చేసి కిటికీలు, తలుపుల అద్దాలు విరగోట్టారు.ఈ దాడిలో దాదాపు 50 మంది న్యాయవాదుల పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడే నాయకులను ఇక్కడ తిరగనివ్వం అని వారు హెచ్చరించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.