2, మార్చి 2011, బుధవారం

పాస్ పోర్ట్ కావాలన్న వైఎస్ మాటలు నిజమవుతున్నాయి

తెలంగాణా ఏర్పాటు జరిగితే పాస్ పోర్ట్ కావాల్సి వస్తుందని నాటి ముఖ్యమంత్రి వైఎస్ చేసిన ప్రకటనలు వాస్తవ రూపం దాలుస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల ప్రజాభిప్రాయాన్ని చెపితే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.. అనుక్షణం చస్తు బతకమని... ఆదేసాలిస్తున్నారని ఇదేమైనా పాకిస్తానా? ఇతర దేశమా? మాట్లాడనిచేది లేదంటే ఎలా? ఇన్నాళ్ళు తెలంగాణా నేతలు ఎం మాట్లాడినా ఉరుకొంటున్నమంటే.. మా మౌనాన్ని అంగీకారంగా రెచ్చి పోతున్నారని.. దాడులు చేసి భాద్యత గల నేతల పైనే దాడులు చేస్తుంటే సామాన్యుడు బెoబెలెత్తి పారి పోతాడని తెరాస నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోందని జేసి విమర్శించారు.