2, మార్చి 2011, బుధవారం

అవినీతికి వ్యతిరేకంగా...240 మైళ్ళ దండి యాత్ర

దండియాత్ర తరహాలో అమెరికాలో నివాసముంటున్న మన భారతీయులు దాదాపు 240 మైళ్ళ యాత్రని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా.."దండియాత్ర-2 " పేరుతొ నిర్వహించే ఈ యాత్ర ఈ నెల 12 వ తేదీన కాలిఫోర్నియాలోని మార్టిన్ లూథర్ కింగ్ జునియర్ మెమోరియల్ పార్క్ నుంచి ప్రారంభమై శాన్ఫ్రాన్సిస్కో లోని గాంధి విగ్రహం వరకు సాగుతుంది. ఇదీ రోజుల్లో అమెరికాలోని పది ప్రధాన నగరాలతో పాటు భారత్లోని అన్ని ముఖ్య పట్టణాలలో స్తానిక స్వచ్చంద సంస్తలు, ప్రజల సహకారంతో ఈ యాత్రని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా...పనిచేస్తున్న వారితో పాటుగా భారత్లో అవినీతిని పారద్రోలాలనుకొనే ప్రతివొక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపిచ్చారు. కాగా. ఈ దండి యాత్ర-2 నాడు గాంధి దండియాత్ర చేపట్టిన తేదీలలోనే జరుగుతుండటం గమనార్హం.