2, మార్చి 2011, బుధవారం

తెలంగాణాకోసం ఏమి త్యాగాలు చేసారో...నిలదీయండి

తెలంగాణా ప్రాంత ప్రజల అభిప్రాయాల మేరకు ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు వారి అభిప్రాయాలను ప్రతిబింభించడంలో తప్పులేదని..తానూ కూడా వారి పద్దతిలోనే తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంత ప్రజలు కోరుకుంటున్న సమైక్యతని తమ ప్రాంత ప్రజల అభిప్రాయాలను తాను ప్రతిబింభించవలసిన అవసరం తనకి ఉందన్నారు కాంగ్రెస్ ఎంపి రాయపాటి సాంబశివరావు.

బుధవారం తెలంగాణ న్యాయవాదులు తన ఇంటిని ముట్టడించిన నేపధ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ వ్యతిరేకులను బెదిరిస్తే... ఇతరుల ఇళ్లపై దాడి చేస్తే..ప్రత్యేక రాష్ట్రం వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రమే తెలంగాణా సమస్యకి పరిష్కారం చూపాలని... రాజ్యాంగం తెలిసిన విజ్ఞులైన న్యాయవాదులు తన ఇంటి పై దాడి చేస్తేప్రయోజనం ఉండదని, వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి తెలంగాణాకోసం ఎలాంటి త్యాగాలు చేసారో... కేంద్రాన్ని ఈమేర ఒప్పించాగలిగారో అడగాలని అన్నారు. తాను తెలంగాణ వాదనను వ్యతిరేకించలేదని... ఈ రాష్ట్రాన్ని జిల్లాకి ఓ రాష్ట్రము చొప్పున 24 రాష్ట్రాలు చేసినా తనకి అబ్యంతరం లేదన్నారు. తెలంగాణాని ఇస్తామంటే కావురో, కిరణ్ కుమార్ రెడ్డో అడ్డుకొంటే ఆగిపోయే చిన్న అంశం కాదన్నారు.

శ్రీకృష్ణ కమిటి వేసినప్పుడు ఆమోదించిన.. దానికి నివేదికలిచ్చిన నేతలు... దాని కి తాము కట్టుబడి ఉంటామంటే.. వారు మాత్రం ఇప్పుడు శ్రీకృష్ణ కమిటి ఫార్సు అంటూ ప్రకటనలు చేస్తున్నారని ...అసలు తెలంగాణా నేతలకు చిత్తశుద్ది లేదని. తెలంగాణా విషయంలో వారి మధ్యనే అభిప్రాయ భేదాలున్నాయి.. అంతమాత్రాన దాడులు చేసుకొంటారా అని నిలదీసారు. తెలంగాణా లోని కొందు నేతలు తెలంగాణా కోరుకొనే ప్రజల కోసం ఏం త్యాగాలు చేయాలో అవి చేయకుండా, కావూరి, లగడపాటి లాంటి డబ్బులున్నవారి పేర్లు నాలుగు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.ప్రజలు మంచివాళ్లు కాబట్టి ఇంకా వారి మాటలు వింటున్నారన్నారు.

తెలంగాణా ప్రాంతంలో ఒక్క పైసా సంపాదించలేదని.. తానూ ఈప్రాంతానికి దూరంగా ఇతర దేశాలలో సైతం నేను కష్టపడ్డా , పదిమందికీ ఉపాధి చూపించా.. వారితో పాటే నేను ఎదిగా... అని ఇది తప్పేలా అవుతుందన్నారు. సీమాంధ్ర నేతలు తమ ఇంట్లో ఐదవ తేదీన కలుస్తున్నట్లు తాను ఎవరికైనా చెప్పానా? ఓ వేలా తము కలవాల నుకొంటే ఇక్కడి నేతల అనుమతి తీసుకోవాలా? ఇది ప్రజాస్వామ్యమా? రాజరికమా? ఇది ఎవరైనా రాజుగారి పాలనలో ఉందా? అని కావూరి ప్రశ్నించారు.