2, మార్చి 2011, బుధవారం

కెసిఆర్ కుటుంబం కూడా ఆరోజు రోడ్డు మీదే

ఈ నెల 10 తేదీన మిలీనియర్ టూ హైదరాబాద్ కార్యక్రమానికి యావత్ తెలంగాణా పల్లెలన్ని కడలి రావాలని టిఆర్ఎస్ నేత నాయిని నరసింహారెడ్డి పిలుపు ఇచ్చారు.

టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ భవన్'లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆ రోజు హైదరాబాద్ ప్రజలు రోడ్డుపైనే వంట చేసుకోవాలని ఆయన కోరారు. కెసిఆర్ కుటుంబం కూడా ఆరోజు రోడ్డు మీదే వంట వండుకుంటుందని ఆయన చెప్పారు.

రాత్రికి రాత్రే తెలంగాణ సమస్య పరిష్కారం కాదని చిదంబరం అనటం సరికాదని మండిపడ్డారు. ఓ మతిలేని మంత్రని చిదంబరం తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను నాయని తప్పుపట్టారు.