2, మార్చి 2011, బుధవారం

మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం : కొండా సురేఖ

తెలంగాణా కోసం తాము నిజాయితిగా పోరాటం చేస్తున్నట్లు భావిస్తే తక్షణం కావూరి చేసిన వ్యాఖ్యలకు భాద్దులై తెలంగాణా ప్రాంత ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేయాలనీ పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, జగన్ వర్గ నేత కొండా సురేఖ. బుధవారం ఆమె వరంగల్ లో మీడియాలో మాట్లాడుతూ రైల్ రోకోల వాళ్ళో, ప్రజలని ఇబ్బందులు పెట్టడం వల్లో, దాడులు నిర్వహించడం వల్లో తెలంగాణా రాదన్న విషయం గుర్తెరగాలని. రాజీనామాల ద్వారానే ప్రభుత్వాలని కదిలించి తెలంగాణా సాధించవచ్చని చెప్పారామే. తెలంగాణా ప్రాంత ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసేందుకు ముందుకొస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామన్నారు సురేఖ.