13, మార్చి 2011, ఆదివారం

కేసీఆర్ తెలంగాణ ద్రోహి కాక ఏమవుతాడు

ఆనాడు ఎన్టీఆర్ హయాంలో ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహావిష్కరణ సమయంలో తెలంగాణ యోధుడు కొమరం భీమ్‌ను మరిచిన కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని విరుచుకుపడ్డారు.
విగ్రహావిష్కరణ సమయంలో ఆ నాడు తెలుగు దేశంలో కీలక పదవిలో కేసీఆర్‌కు ఏ ఒక్క తెలంగాణ యోధుడు గుర్తుకురాలే దు... కాని, ఇపుడు తెలంగాణా కోసం కోసం చనిపొయిన కుటుంబాలపై తనకే సానుభూతి ఉన్నట్లు మాట్లాడుతున్నాడని ఎక్కడా లేని ప్రేమ నటిస్తూ యువతను , ప్రాంతీయతత్వాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.