27, సెప్టెంబర్ 2012, గురువారం

వ్యతిరేకత విషయం ఆజాద్‌కు తెలియదట

 బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల విభజన సమయంలో వ్యతిరేకత వచ్చిన విషయం ఆజాద్‌కు తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు చెప్పారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ మార్చ్‌లో పాల్గొంటానని, నాయకత్వం వహిస్తానని పేర్కొన్నారు.
తెలంగాణపై ఏకాభిప్రాయం అవసరమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ అంశంపైనా ఏకాభిప్రాయం సాధ్యం కాదని ఆయన తెలిపారు.