27, సెప్టెంబర్ 2012, గురువారం

సచివాలయానికి తాళం... ప్రభుత్వం అదేశాలు

తెలంగాణసెగ రాష్ట్ర సచవాలయానికి తాకింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ రాజకీయ జేఏపీ పిలుపు మేరకు ఈనెల 30న తెలంగాణ మార్చ్ జరుగనున్న నేపథ్యంలో సచివాలయంపై దాడులు జరిగే అవకాశం ఉన్నందున, పోలీసుల ఉత్తర్వుల మేరకు 29, 30 ఈ రెండు రోజులు సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. అలాగే సచివాలయం ప్రాంగంలో ఐదుగురు గుమిగూడి ఉండకుండా 144 సెక్షన్‌ను అధికారులు విధించారు.