ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా ఆన్లైన్ విధానం పిటిషన్పై సుప్రీం
కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. అన్లైన్ అడ్మిషన్లపై
హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ గురువారం సుప్రీం తీర్పు నిస్తూ
ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు విచారణ జరిపిన సుప్రీం కోర్టు విద్యా
సంవత్సరం మధ్యలో నిబంధనలు మార్చడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి
మొట్టికాయలు వేసింది.
కావాలంటే వచ్చే సంవత్సరం నుంచి ఆన్లైన్ విధానం అవలంభించ వచ్చని సూచించింది. ఇంజినీరింగ్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఆన్లైన్ విధానంపై దాఖలైన కేసులో తీర్పునిస్తూ ఆన్లైన్ విధానం చెల్లదని ప్రభుత్వాన్ని తప్పుబడుతూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో పైతీర్పు వెలువడింది.
కావాలంటే వచ్చే సంవత్సరం నుంచి ఆన్లైన్ విధానం అవలంభించ వచ్చని సూచించింది. ఇంజినీరింగ్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఆన్లైన్ విధానంపై దాఖలైన కేసులో తీర్పునిస్తూ ఆన్లైన్ విధానం చెల్లదని ప్రభుత్వాన్ని తప్పుబడుతూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో పైతీర్పు వెలువడింది.