1, మార్చి 2011, మంగళవారం

సీమాంధ్ర ఉద్యోగులకీ జీతాల్లేవ్.....

తెలంగాణాలో జరుగుతున్న సహాయ నిరాకరణ ఎఫెక్ట్ సీమంధ్ర ఉద్యోగులపైనా పడింది. సర్కారి ఖర్చులకీ కటకట లాడుతుండటంతో ప్రస్తుత పరిస్తితిలో తెలంగాణాలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకి మినహా ఎవ్వరికీ జీతాలు చెల్లించే పరిస్తితి లేదని ప్రభుత్వ వర్గాల కధనం. ఇప్పటికే "నో వర్క్ - నో పే" నినాదాన్ని తీసుకొన్న సర్కారు, పలుమార్లు తెలంగాణా ఉద్యోగ సంఘాలతో చేసిన చర్చలు విఫలమైన నేపధ్యంలో తెలంగాణా ఉద్యోగులకి ఫెబ్రవరి జీతాలు ఇచ్చేలా కనిపించడం లేదని వినిపిస్తుంటే తాజాగా సీమంధ్రలో ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేమని మరి 10,15 రోజులు వేచి చూడాలని సంభందిత శాఖాధీపతులకి  చెప్పినట్లు సమాచారం. అలాగే పెన్షనర్ల ఖాతాలలో సొమ్ములు జమచేయవద్దని తెజరీలకు మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.