4, ఏప్రిల్ 2011, సోమవారం

మా ఆయన తగ్గితే.. పులివెందుల బరిలో నేనున్నా

దివంగత మహానేత వైఎస్ఆర్ సతీమణి వైఎస్.విజయలక్ష్మిపై తన భర్త రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి పోటీకి వెనుకంజ వేస్తె.. తాను పోటీ చేసేందుకుసిద్ధంగా ఉన్నట్టు సతీమణి వైఎస్.సౌభాగ్యమ్మ తన కుటుంబ సభ్యులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఉగాది పర్వదినాన.. వివేకా కుటుంబ సభ్యులంతా ఇంట్లో సమావేశమై.. పులివెందుల ఎన్నికల గురించి మాట్లాడు కొన్నట్లు తెలుస్తోంది. పులివెందులలో పోటీ తప్పుకోవడం ద్వారా వైయస్ అంటే అధిష్టానానికి అభిమానం ఉందనే సానుభూతిని కడప పార్లమెంట్ స్తానంలో ఉపయోగించుకోవాలని తద్వారా పార్లమెంటు అభ్యర్థిగా వివేకాను పోటీకి నిలిపితే జగన్ మెజార్టీ భారీగా తగ్గిన్చవచ్చాన్న వాదనతో సౌభాగ్యమ్మ అంగీకరించలేదు సరికదా... తన భర్త వెనుకంజ వేస్తె.. తాను పోటీ చేసేందుకుసిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పడంతో అడిసగా కాంగ్రెస్స్ పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.