14, నవంబర్ 2010, ఆదివారం

రాజా.. రాజీనామా

2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే నేత, కేంద్ర టెలికాం మంత్రి ఏ రాజా మెట్టు దిగినట్లు తెలుస్తోంది. చెన్నై నుంచి నేరుగా ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసానికి ఆదివారం వెళ్లిన రాజా.. ప్రధానికి తన రాజీనామా సమర్పించారని తెలుస్తోంది.

ఈ కుంభకోణంపై కాగ్ నివేదిక నేపథ్యంలో తాను ఎట్టి పరిస్థితుల్లో పదవీ నుంచి దిగిపోనని చెప్పిన ఆయన... గత కొంతకాలంగా తనను కలవరపెడుతున్న వివాదాలను నివారించేందుకు ...పార్లమెంటులో శాంతి, సామరస్యాలను నెలకొల్పడానికి రాజీనామా చేయమని డీఎంకే అధినేత కరుణానిధీ తనకు చెప్పినట్లు రాజా తెలిపారు

కుంభకోణంపై రాజాపై వేటు వేయాలని భగ్గుమన్న విపక్షాలు.. శీతకాల సమావేశాలలో రభసా సృష్టిస్తున్నాయి.