3, నవంబర్ 2010, బుధవారం

జలుబుకి మందు రెడీ


మనిషి.. కేన్సర్, హెచ్‌ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఎంతోకొంతమేరకు చికిత్స కూడా కల్పించగలిగాడు. కానీ జలుబుకు మా త్రం చికిత్స కల్పించలేకపోయాడు. అయితే ఈ కొరత కూడా తీరబోతోందంటున్నారు కేంబ్రిడ్జ్ వర్సిటీ శాస్తవ్రేత్తలు. జలుబుకు విరుగుడుగా రోగ నిరోధక వ్యవస్థను శక్తిమంతం చేసే కేంద్రాలను గుర్తించామంటున్నారు.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాంటీబాడీలు కణాల బయటే వైరస్‌లపై దాడి చేసి లోపలికి చొచ్చుకుపోకుండా ఆపుతాయని ఇప్పటివరకూ భావిస్తూండగా ఇది తప్పని తాజా పరిశోధనల్లో తేలింది. యాంటీబాడీలు కణాల్లోపలకూ వెళుతున్నాయని, ట్రిమ్21 అనే ప్రొటీన్ విడుదలకు కారణమవుతున్నాయని తెలిసింది. ఈ ఫలితాల ఆధారంగా ట్రిమ్21 ప్రొటీన్ మోతాదును పెంచే మందులను తయారు చేశారు.

సాక్షి నుంచి సేకరణ