3, నవంబర్ 2010, బుధవారం

తిరుమలలో పంచాంగ గణిత సదస్సు

హిందూ పండుగలు, పర్వదినాల తిథులకు సంబంధించి ఎదురవుతున్న మీమాంసలను అధిగమించేందుకు వీలుగా డిసెంబర్ 24వ తేదీ నుండి మూడు రోజుల పాటు తిరుమలలో పంచాంగ గణిత సదస్సును నిర్వహించేందుకు టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం నిర్ణయించింది.

అథారిటీ చైర్మన్ జె సత్యనారాయణ మాట్లాడుతూ హిందూ పండుగలు, పర్వదినాలు ఏ రోజు నిర్వహించాలనే విషయమై మీమాంస తలెత్తడం పరిపాటిగా మారిందన్నారు. దీని వల్లే పంచాంగ గణిత సదస్సును నిర్వహించేందుకు టిటిడి సంకల్పించింది అని చెప్పారాయన