26, ఏప్రిల్ 2011, మంగళవారం

సిగ్గు, లజ్జ ఉంటె తక్షణం రాజీనామా చేయండి

ఒక పార్టీ పేరు మీద గెలిచి మరో పార్టీలో తిరగడం నైతిక కాదని... తమ కాంగ్రెసు తరఫున గెలిచి వైయస్సార్ కాంగ్రెసులో తిరుగుతున్న శాసనసభ్యుల కు సిగ్గు, లజ్జ ఉంటె తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని మంత్రి రఘువీరా రెడ్డి డిమాండ్ చేసారు. మంగళ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ పథకాలను తాము నిలిపేస్తున్నట్లు జగన్ ప్రచారం చేసుకొంటూ రాజకీయాలు నడుపుతున్నాడని ఎక్కడా వాటి అమలు ఆగలేదని, ఉప ఎన్నికల వల్ల సంక్షేమ పథకాల అమలుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు.