25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

రైల్వే బడ్జెట్ ప్రశంసాత్మకం

రైల్వే మంత్రి మమతాబెనర్జీ ప్రశంసాత్మకంగా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. రవాణా రేట్లను గాని ప్రయాణికుల చార్జీలు కాని పెంచలేదన్నారు. ఇందువల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందన్నారు. కీలకమైన మౌలికసదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఇది దేశ ఆర్ధికాభివృద్ధికి ఊపునిస్తుందన్నారు. రైల్వే మంత్రి ప్రశంసార్హమైన పనిచేశారని కొనియాడారు.