25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

‘జైబోలో తెలంగాణ’ పైరసీలో పెద్దల హస్తం

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ‘జైబోలో తెలంగాణ’ చిత్రాన్ని నిర్మించానని, అయితే విడుదలైన మూడోరోజునే పైరసీ సీడీలు వచ్చాయని చిత్ర దర్శకనిర్మాత శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. జైబోలో తెలంగాణ చిత్రాన్ని పైరసీ చేయడంలో కొంతమంది పెద్ద మను షుల హస్తం ఉండొచ్చని..తనకు అందిన సమాచారం మేరకు పదిజిల్లాల్లో లక్షకుపైగా క్యాసెట్‌లు డంప్ జరిగిందని ఆరోపించారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఇంత పెద్ద ఎత్తున పైరసీ జరిగిందని ఆరోపించారు.

పైరసీని అరికట్టే బాధ్యత పోలీసులదని, వారు శ్రద్ధ పెట్టకపోవడం విచారకరమన్నారు. . పైరసీ చేయడం ద్వారా సినీ పరిశ్రమపై వేలాది కుటుంబాలు ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ఉద్యమం నేపథ్యంలో వచ్చిన తమ చిత్రాన్ని ప్రతిఒక్కరూ థియేటర్‌లోనే చూడాలని శంకర్ కోరారు.