25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

వచ్చేనెల 5 వరకు సహాయ నిరాకరణ

:సహాయ నిరాకరణతో ఇప్పటికే ప్రభుత్వ పాలన జిల్లాలో పడకేసింది...ఎక్కడి ఫైళ్ళక్కడేఆగి పోయి ఉన్నాయి...కాగా ఇదే స్థితి మార్చి 5 వరకు కొనసాగిస్తామని ఉద్యోగుల జెఏసి ప్రకటించింది... అప్పటికీ కేంద్ర సర్కారు దిగి రాకుంటే ఏకంగా నిరవధిక సమ్మెకు దిగాలని ఉద్యోగుల సంఘం నిర్ణయిం చింది...ఈ తాజా నిర్ణయం ప్రభత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేదిగా పరిణమించింది...ఒక వేళ నివరధిక సమ్మెకు దిగితే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది...

ఇప్పటికే అనేక మంది లబ్ది దారులకు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు అందడంలేదు...ఇక సమ్మెకుదిగితే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి...