25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఏకాభిప్రాయం వచ్చాకనే తెలంగాణ'తీర్మానం'

తెలంగాణ అంశంపై శాసనసభ్యుల నడుమ ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానాన్ని పెడుతుందని శాసనసభావ్యవహారాల మంత్రి డి.శ్రీధర్ బాబు శుక్రవారం తేల్చి చెప్పారు. ప్రభుత్వం గతంలో సంబంధిత పార్టీలతో సంప్రదింపులు జరపటం ద్వారా తెలంగాణ అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నించిందని.. తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని... ప్రతి విషయాన్ని కేంద్ర నాయకత్వందృష్టికి తీసుకెళ్లి తెలంగాణా అంశం త్వరగా తేల్చాలని కోరుతున్నామని ఖచ్చితంగా ఒక పరిష్కారం వస్తుందనే ధీమా వ్యక్తం చేసారు

తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని ప్రస్తుత పరిస్థితిలో సభ్యులు నడుమ 'ఏకాభిప్రాయం' రాదని తెలిసి కూడా ఆ అంశంపై తీర్మానం పెట్టడం సరికాదని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై తీర్పు ఇవ్వాల్సింది ప్రజలేనని కేంద్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకుగాను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య పంథాలో వారి ఆందోళనలను వ్యక్తం చేస్తున్నా.. టిఆర్ఎస్‌ ప్రణాళికతో ముందుకు వెళ్లేచేయాలనే తెలంగాణ జేఏసీ..కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకోని దాడులకు పురిగొలుపుతోందని ఆరోపించారు శ్రీధర్‌బాబు.