5, మార్చి 2011, శనివారం

మిలియన్ మార్చ్ వాయిదా?

ఈ నెల పదవ తేదీన తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ మిలియన్ మార్చ్ ఆందోళనను వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారమ రాత్రి వరకు పలుమార్లు సమావేశమైన నేతలు మోడి పట్టుదలకి పోయి విద్యార్థుల జీవితాలతో అడుకొంతున్నమన్న అపప్రద తెచ్చుకొనే కన్నా పరీక్షలు పూర్తయిన తర్వాత విద్యార్థులతో ‘చలో సెక్రటేరియట్’ నిర్వహించ డమే మంచిదని చెప్పడంతో. వాయిదా విషయాన్ని ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే యుద్యోగు లు సహాయనిరాకరణ విరమించుకోవటం, మిలియన్ మార్చ్ పై హై కోర్ట్ నోటీసులు జారీచేయటం కూడా జెఎసి పునరాలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది.