15, నవంబర్ 2011, మంగళవారం

మనసుకు వికాసం... మన వన భోజనం

రంగేళీ దీపావళి పూర్తయ్యిందంటే... ఇక పిక్నికలే హడావిడి వచ్చేసినట్లే...

ప్రకృతితో మనిషికున్న బంధాన్ని తెలిపేందుకే వనభోజనాలను ఏర్పాటు చేసారు..

బంధువులతో, స్నేహితులతో పాటు సమాజంలో ఇతర వ్యక్తులను కలుపుకు పోయేందుకు...

వివిధ సంస్క ృతులు, సంప్రదాయాలు, పద్దతులు తెలుసుకునేందుకు...

కార్తీక మాసంలో వచ్చే వనభోజనాలు ప్రతి ఒక్కరికీ ఉపయుక్తంగా ఉంటుందన్నది వాస్తవం.

కార్తీక మాసంలో ప్రతి రోజూ పిక్నికలే హడా విడి అంతా ఇంతా కాదు. పట్టణ వాతావరణంలో పార్కులకి, విహార కేంద్రాలకి రోజూ వెళ్లి రావటం, అక్కడే భోజనాలు చేయటం పరిపాటిగా మారినా... నేటికీ గ్రామీణ ప్రాంతాలలో కార్తీక సమారాధనలు, వనభోజనాల పేరుతో ఃపిక్నికఃలు జరుగు తున్నాయి.

శ్రీకృష్ణ కాలం నుంచే వన భోజనాలు

వాస్తవానికి వనభోజనాలు ఈనాటివి కాదు. శ్రీకృష్ణుడు చిలిపి తనాన్న్ని వర్ణించిన పోతన తన భాగవతంలో లొట్టలేసేలా ఆయన అల్లరిని వన భోజనాలను వర్ణించాడంటే అప్పటి నుండి ఇవి ఉన్నాయన్న మాట.

కార్తీకేహం కరిష్యామి ప్రతస్ధానం జనార్ధన ప్రీత్యర్ధం దేవా దేవేేశ దావెూదర మయాసహా...

అని కార్తీక మంత్ర జపంతో ప్రతి రోజూ ఉదయాన్నే చన్నీటి స్నాన మాచరించి... దీపంకి వాడే నూనె దైవ గుణానికి, వత్తి సత్య గుణానికి, అది రూపే వెలుగు రాజ గుణాలకు ప్రతీకలని, ఈ మూడు గుణాలు కలగలిసిన ప్రమిద తమ జీవితాలలో జ్ఞానదీపాలను వెలిగిస్తుందని పెద్దలు చెప్తారు. అంటే... రాజస్తవెూ గుణాలను అణచి వేసి సహజ సిద్దమైన మనిషిగా తయార వ్వాలనుకునే వారు సత్య గుణాన్ని అలవరచుకోవాలనిఅపðడే జీవితంలో జ్ఞానాంధకార మనే చీకట్లను తరిమివేస్తూ వెలుగు రేఖలు వికసిస్తాయని తద్వారా వెూక్ష మార్గం కి బాటలు వేస్తుందని మన పూర్వీకుల విశ్వా సం. శివ, విష్ణు భేదాలున్న సమయంలో పవిత్రమైన కార్తీక మాసాన్ని ఏకరీతిన ఆచరించడమే కాకుండా... సమాజంలో సామరస్య పూర్వక వాతావరణాన్ని తీసు కొచ్చేందుకే ఆయా ఆలయాల్లో... కార్తీక దీపా లు పెడితే... పుణ్య మని పూర్వీకులు చెప్పిన మాటల్ని నేటికీ ఆచరిస్తోందీ సమాజం.

కార్తీకంలోనే ఎందుకు

ఇక కార్తీక మాసంలోనే వస భోజనాల ఏర్పాటు చేసేందుకు మన పూర్వీకు లు ఎందుకు నిర్ణయించారంటే... మనకున్న 12 తెలుగు నెలలు ఆరు ఋతువులతో అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయి.

చైత్ర, వైశాఖ మాసాలలో వసంత ఋతువు వచ్చే నెలలు. ఈ నెలల్లో ప్రకృతి కొత్త పులకరింతలకు సిద్దమవు తున్నా, ఎండల వేడిమి తీవ్ర వడగాడ్పు లు సాధారణంగా ప్రజల్ని బైటకు వెళ్లే పరిస్ధితి కలిపించవు. ఎండలు పెద్దగా అనిపించకపోయినా, తీవ్ర బడలిక చెందుతాం .

ఇక జ్యేష్ఠ, ఆషాఢంలో గ్రీష్మ ఋతువులో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించేరోజులు..ఈ కాలం లోని సాధారణ పరి స్ధితిలోనే మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఈ కాలంలో బైట తిరగ టం వల్ల అనేక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది.

ఆపై వచ్చే శ్రావణ, భాద్రపదంలలో వచ్చే వర్షఋతువు కారణంగా ఏ క్షణాన వర్షాభావ పరిస్ధితి ఏర్పడుతుందో తెలియదు. అలాగే... నేలలు చిత్తడిగా ఉండటం, పర్యాటక ప్రదేశాలు, తోటలు, ప్రతి ఒక్కటి బురద గా, అపరిశుభ్రంగా తయారవ్వటంతో ఎక్కడా కూర్చొనే పరిస్ధితి ఉండ దు. ఈ సీజన్‌లో వన భోజనం ఎలాంటి సంతృప్తి ఇవ్వదు సరికాదా రోగాల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి.

ఇక ఆశ్వయుజ, కార్తీకా లలో వచ్చే శరద్‌ ఋతువు. ఆశ్వ యుజంలోను వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ కాగా.. కార్తీకంలో కాసింత వేడి, చిరు జల్లులు, సాయంత్రానికి చిన్నపాటి చల్ల గాలులు వెరసి ఓ ఆహ్లాద కరవాతావరణం ఉంటుంది.

ఆపై వచ్చే మార్గశిర, పుష్య మాసాలు హేమంత ఋతువుకి ప్రతీకలు. ఈ కాలం ఎక్కువగా మంచుకురిసే, క్షణాలే ఎక్కువ. దీంతో ఈ నెలల్లో బైట తిరగాడే చిన్నారుల్లోనే కాదు. సాధారణ వ్యక్తులలోనూ అనేక రుగ్మతలు వచ్చే అవకాశాలు బొలెడున్నాయి.

చలి మంటలు, కాసింత వేడి ఇలా వాతావరణం ఆనందకరంగా ఉన్నా... ఉబ్బసం, శ్వాస సంబంధిత వ్యాధులు, ఇతర వ్యాధులను పైకి వస్తాయి. అలాగే చివరిగా మాఘ, ఫాల్గుణ మాసాలలో వచ్చే శిశిర ఋతువు చెట్ల ఆకులరును రాలుస్తూ... ప్రకృ తంతా బాధాతత్పహృదయంలో విలవిలలాడుతున్నట్లుం టుంది., పచ్చనివాతావరణ ఎక్కడా కానరాక మనసు కు కూడా ఎలాంటి ఆహ్లాదం దక్కదు.

అందువల్లే కార్తీక మాసం అన్నింటా, అందరికీ ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతుందని ముఖ్యంగా శివకేశవులకు ఇష్ట ప్రదాయకమైన నెలగా భావించిన పెద్దలు ఈ నెలలో సమారాధనలు చేయటం (అన్నదానం) శ్రేష్టమైనదిగా పేర్కొన్నారు.

కార్తీక మాసంలో వర్షాభావ పరిస్ధితి తక్కువగా ఉండటం... ఆశ్వ యుజంలో కురిసిన వర్షాలకు నేల చిత్తడ ిగా మారినా... అవన్నీ ఇగిరి గట్టి పడుతుం డటం, ప్రత్యేకంగా సంతోషకర పరిస్ధితులు ఎక్కువగా ఈ కార్తీక మాసంలో ఉండటం వల్లే వన భోజనాలకు ఈ నెలను ప్రత్యేకించా రోవెూ

వనాలలో భోజనాలు...

ఆహ్లాదకర వాతావరణాన్ని, ఆయుర్వేద గుణాలున్న చెట్లు, మొక్కలపై నుండి వీచే గాలులు పీల్చడం వల్ల కూడా ఆరోగ్యం సిధ్దిస్తుందని భావించిన పెద్దలు ఇలా వనాలలో భోజనాలు ఏర్పాటు చేసే వారని కొంద రు పెద్దలు చెప్తుండగా... ఆధునిక సమాజానికి


దగ్గరవుతూ అనేక ధ్వేషభావనలు పెంపొందించుకుని కులాల గోడలు, అనేక కట్టు బాట్లు విధించుకుని... లేని పోని భేషజాలకు పోయి. సమాజంలో అనేక విపరీత పరిణామాలు సిద్దిస్తున్న దశలో అందరినీ ఊరికి దూరంగా ఓ చోట కూర్చొన బెట్టి పరస్పర చర్చలు సమావేశాలు జరపటం, ఆరోజున ఎలాంటి యుధ్ద పరిస్ధితి నెల కొన కుండా ఆ ప్రాంతాలలో పూజలు, వ్రతాలు, చేసేవారని... అందరికీ సహపంక్తి భోజనాలు జరపి భోజన కాలే... హరిణా మస్మరణే... గోవిందా... గోవిందా... అంటూ భక్తి భావన తోడు చేసేవారు. దీని వల్ల తర తమ భేధాలు తగ్గి వైషమ్యాలు దూరమై సహజీవనా నికి బాటలు పడేవని.. ఈ క్రమంలోనే వనభోజనాలు పుట్టుకొచ్చాయని మరికొందరు పెద్దలు చెప్తారు.

ఇక సమాజంలో వస్తున్న మార్పులు, జరుగుతున్న పరిణామాలతో పాటు వాస్తవ దృక్కోణంలో వివిధ వర్గాల ప్రజల ఆచార వ్యవహారాలను దగ్గర నుండి పరిశీలించే అవకాశాలు ఈ వనభోజనాలు దారి చూపిస్తాయన్నది వాస్తవం.

మరోవైపు మన దేవతలు కూడా ఎక్కువగా ఏ కొండ పైనో, వనాలలోనో వెలసి, తమ భక్తులని తమ దరికి రప్పించుకుంటారు. ఇలా దైవ దర్శనానికి గుంపులుగా వెళ్లే భక్తులు చెట్ల నడుమ భోజనాదులు చేసేవారు.

కాల క్రమంలో పెరిగిన రవాణా వ్యవస్ధ... ఈ వనభోజనాలకు దూరం చేయటం తో... ఏడాదిలో ఓ సారైనా తమ వారం దరితో ఉల్లాసంగా గడిపే క్షణాలుగా వన భోజ నాలను గుర్తించి వీటిని క్రమం తప్పకుండా పాటిస్తు న్నాడని మరికొందరు చెప్తారు. నాగరిక సమాజంలో యాంత్రిక జీవనాన్ని అనుభవిస్తున్న మనిషికి షడ్రుచుల సమ్మేళనమైన భోజనాలతో పాటుగా ఆనందోత్సాహాలను అందించడమే కాదు... భవిష్యతరానికి అనేక విషయాలలో మార్గ దర్శకంగా కార్తీక శోభ, వనభోజనాలు నిలుస్తున్నాయనటంలో సందే హం లేదు.

పెరుగుతున్న కార్పొరేట్‌ కల్చర్‌...

కార్తీక మాసంలో శివుడికి, విష్ణువుకీ దీపారాధన చేసి.. ఉసిరి చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేస్తే... పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందన్నది పూర్వీకులు చెప్పేవారు. కాలక్రమంలో వన భోజనాలు విద్యార్ధులలో చైతన్యం తీసుకొచ్చేందుకు, వారికి సమాజ కట్టుబట్లు ఇతర విషయా లపై అవగాహన కలిగించేందుకు ఉపయోగపడేవి. అయితే గత మూడు దశాబ్ధాలుగా సమాజంలో వస్తున్న అనేక మార్పులు కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విడిపోయి వనభోజనాలు జరుగుతున్నా యి. కాగా మరోవైపు ఈ వన సమారాధనలల్ని నాగరిక సమాజంలో పికనిేకలే పేరుతో విచ్చల విడి తనానికి ప్రతీకగా మారి పోయింది. పేకాట రాయుళ్లకి పిక్నికలుే నిత్యపండగగా మారిపోగా.. పిక్నికలేలో చిన్నారులకు, మహిళలకు ప్రత్యేకంగా జరిగే ఆటల పోటీలు పసందుగా ఉంటాయి. కార్తీక మాసం శివుడికి ఇష్ట ప్రదమైన నెల అని... నదీతీరాలలో పిక్నిక లు ఏర్పాటు చేస్త్తూనే... అక్కడే భక్తి శ్రద్దలతో స్నానాదులు, వంటలు పెడుతు... భక్త కన్నప్ప కూడా మాంసాదులతోశివుడ్ని ఆరాధించాడని చెప్తూ... నేడు పికనిేకలేలో మంసాహార వడ్డన క్రమంగా పెరుగుతోంది. అత్యంత భక్తి భావనతో కార్తీక మాసాన్ని జరుపుకుంటూ మద్య, మాంసాదులకు దూరంగా ఉండే కుటుంబాలు చాలనే ఉన్నాయి. అయితే ఇలా మాంసాదులతో వన భోజ నా లను కలుషితం చేస్తున్నారన్న భావన సర్వత్రా వినిపిస్తోంది. పెద్ద పెద్ద హౌటళ్లు కూడా ఈ కల్చర్ని ప్రోత్స హిస్తూ... మన పూర్వీకులు కనీసం కార్తీక మాసంలోనైనా మాంసం తినకుండా దూరంగా ఉండి జీవ హింసకి పాల్పడరని ఆశిస్తే... దానికి తిలోదకాలు ఏనాడో ఇచ్చే సారు. ఇలాంటి పరిణామాలకు దూరంగా ఇక ముందైనా పిక్నికలుే జరగాలని ఆశిద్దాం.

వనాలలోనే భోజనాలెందుకు

ఒకపðడు వనాలలో ఉండి ప్రకృతి వైద్యం వల్ల ఆరోగ్య కరంగా ఉండే మనిషి... నాగరికత పెరిగాక ప్రకృతి వైద్యాన్ని వీడి అనేక రకాల వైద్యాల బాట పట్టాడు. చెట్టు బెరళ్లు, వేర్లు, ఆనేక ఆకు పసర్లు, ఇలా అనేక వృక్ష జాతులకు దూరమై...ఈ క్రమంలో అనేక రుగ్మతలకు చేరువయ్యాడు.

దీంతో మళ్లీ మానవాళిని ఏడాదిలో కనీసం ఒక్క రోజైనా వనాలకు వెళితే... కొంతమేరైనా మానసికోల్ల్లాసంతో పాటు ప్రకృతి ఆయుర్వేద ఔషధ గాలులు పీల్చ్చి.. ఆరోగ్యవంతుడవుతాడన్న ఆవస్యకతని తెలియచేస్తూ వనభోజనాలు ఏర్పాటు చేసినట్ల్లు పెద్దలు చెప్త్తారు.

సమిష్టి తత్వానికి ప్రతీకలుగా...

ఇప్పటికే ఉమ్మడి కుటుంబవ్యవస్ధ ఛిన్నాభిన్నమె...ౖ ఆనందాలే కాదు.. ఆచార వ్యవహారాలు దాదాపు మరచిపోతున్న క్రమంలో వన భోజనాలు సమిష్టి తత్వాన్ని పెంపొందించేందుకు అవకాశాలు చూపుతున్నాయనటంలో సందే హం లేదు. వ్యక్తుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటాలకు పిక్నికలుే కూడా వేదికలైపోతుండటం విచారకరం... ఈ వనభోజనాలని తమ స్వార్ధం కోసం వాడకొంటున్న వారిని జనం సమిష్టిగానే తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.