15, నవంబర్ 2011, మంగళవారం

వెలుగు స్మృతుల ఃదీపావళిః

  • జగమంతా వెలుగులిచ్చే దీపావళి వచ్చేసింది.... నాడు దీపావళి అనగానే...
  • ప్రతి ఇంటా కనిపించే హడావిడి నేటికి మచ్చుకైనా కానరావట్లేదు.

ఇందుకు కారణాలు అనేకం .... పెరుగుతున్న ధరలు, పెరగని జీతాలు, ఇవి చాలవన్నట్లు రాష్ట్రంలోని పరిస్ధితులు... సామాన్య జనాన్ని కుదేలెత్తించడంతో ఈ సారి దీపావళి తూతూ మంత్రంగానే కానిచ్చేయాలని చూస్తున్నారు జనం.దీంతో తెచ్చిన సరుకు ఎలా అమ్మాలో అర్ధం కాక బాణసంచా వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నారు.మా రోజుల్లో దీపావళి ... అంటూ నిన్నటి తరం చెపðకునే ముచ్చట్లు వింటుంటే...ఇక ముందు దీపావళి జ్ఞాపకాలలోనే మిగిలిపోయే పండగ అయిపోయేలా ఉందనిపించక మానదు.

దసరా హడావిడి పూర్తవ్వగానే దీపావళి హడావిడి ప్రారంభమయ్యేది. నిన్నటి తరంలో ఓ పదిహేను రోజులు ముందుగానే అన్ని ఇళ్లకి ఆ సందడి వచ్చేసి... దాదాపు అన్ని రంగాల వారికి ఎంతో కొంత ఉపాధి కలిపించేది. దీపావళి నాడు లకిë పూజ కోసం ప్రత్యేకంగా పూలషాపు మొ దలు కొని, బంగారు షాపు, కొత్త దుస్తుల కోసం బట్టల షాపులు, దర్జీలు ఇలా అంతా బిజీ బిజీగా ఉండే వాళ్లు. దీపావళినాడు డబ్బు లున్న వాళ్లయితే కంపెనీ మందుగుళ్లపై మక్కువ చూపి ఎన్నోరకాల టపాకాయల్ని కాల్చేవారు.

ప్రతి ఇంట్లో కుటీర పరిశ్రమే...

దీపావళి కి కావాల్సిన సామన్లు సామాన్య జనం సొంతంగా తయారు చేసుకోవటానికే ఉత్సాహం చూపేవారు. మతాబులు, చిచ్చు బుడ్లు, తూనీగలు, సిసింద్రీలు, తాటాకు టపాకాయ లు, జువ్వలు ఇలా బోలెడన్ని సామగ్రిని ఇళ్లలోనే తయారు చేసుకుని డబ్బుని ఆదా చేసుకునే వాళ్లు. ఈ క్రమంలో దాదాపు అన్ని ఇళ్లు ఓ కుటీర పరిశ్రమలకు కేంద్రాలుగా మారిపోయే వంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇళ్లన్నీ మసి మసిగా తయారవుతా యని పెద్దలు వారించినా... పిల్లలు మాత్రం ఎక్కడో ఓ మూల దేవదారు చెక్కల్ని కాల్సి, వస్త్ర కాగితం పట్టి అందులో సరేకారం, గంధకం కల్పి... సిసింద్రీలు దట్టించి వదిలేవారు. అడ్డూ ఆపు లేకుండా రివ్వుమంటూ ఎగిరే ఈ సిసింద్రీలు ఏ పూరి గుడిసిపైనో పడితే... అరుపులు, కేకలు, నీళ్లతో పరుగులు ఓ వంతైతే... ఇవతల మన వాళ్ల వీపులు విమానం వెూతలతో లకిë బాంబులని తలపించేలా మారు వ్రెూగి పోయేవి. ఇక చిచ్చుబుడ్లు దట్టించేపðడు మొదట్లో పెద్ద వాళ్లు కొంత విసుక్కుని ఏంటీ సంత అంటూ గద్దించినా... బిక్కు బిక్కు మంటూ పిల్లలు దట్టించినవి సరిగా వెలకపోవటవెూ ఏ ఇబ్బందో జరిగితే అలా కాదు ఇలా కాస్త సురే కారం వెరు,ఇంకా గట్టిగా దట్టించు ఇంకా చిట పట మంటూ వెలగాలి అంటూ డైరక్షన్లతో ప్రారంభమై చివరికి లుంగీ ఎగ్గట్టి మందుగుండుని సరి చేసి బుడ్లు దట్టి స్తూ తన చిన్న తనపు దీపావళి కబుర్లు చెపðకుంటూ పనిని పూర్తి చేసే వారన్నది నిజం.

సామాగ్రి ఎండపెట్టడం ఓ ప్రహసనమే...

వంద రూపాయలు పెడితే వచ్చే బుట్టెడు మందుగుండు సామగ్రి (ఇందులో కాకర పువ్వె త్తులు, అగ్గి పెట్లు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, పాము బిళ్లలు, పెన్సిళ్లు, చిటపట కాకర్లు... ఇలా బోలెడన్ని లెక్కకు మిక్కిలి అన్నట్లు ఉండేవి) వీటిని రోజూ ఎండ పెట్టడం కూడా పిల్లలకి పెద్ద ప్రహసనమే... ఇంట్లో వాళ్లు చూడకుండా దొంగచాటుగా కాల్చేసి నాకేం తెలిదన్నట్లు ముఖం మార్చే సుకునే వారు. కావాలంటే గత తరం వారైన మీ అమ్మా నాన్నల్నో, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలనో అడగం డి.. ఇలాంటి దీపా వళి ముచ్చట్లు బోలెడు చెప్తారు.

మొత్తానికి ఃనరక చతుర్ధశిః వచ్చేసిందంటే.. వీధిలో పిల్లల హడావిడి ఎంతో ఊళ్లో తయారు చేసే టపాసుల శబ్ధాలు, జువ్వల రరు... రరు లు.. సురు మంటూ ఎగిరి పడే పిచ్చుకలు ఎక్కడెవరు ఏం కాల్చినా నిల బడి చూసి ఆనందిస్తునే తానూ మరిన్ని చేయాలంటూ ఇంటికి పరుగులు తీసేవాళ్లు. దీపావళి మరో రోజులో వస్తుందన్న సంతోషం అందరిలోనూ కనిపించేది.పండగ రోజు ఇంట్లో ఉదయం నుండి ప్రతి ఇల్లూ సందడే సందడి. తలంటు స్నానాలు, కొత్త బట్టలకు రిబ్బన్‌ మ్యాచింగ్‌ లేదని అలకలు, ఇందుకోసం పది రూపాయలు పట్టుకుని ఊళ్లోని రిబ్బన్ల షాపు లకి పరుగులు.. ఆ జ్ఞాపకాలు అనుభవించే వారు వర్ణిస్తున్నపðడు వింటే ఎంత బాగుంటుందో..

ఇక మద్యాహ్నం పిండి వంటలతో భోజనాలు ముగిస్తే... సాయంత్రానికి ఆడ పిల్లలు ఇంటి ముందు రంగవల్లులతో ముస్తాబులు చేసేవారు. దేవుడి గదిలో అమ్మ చేస్తున్న లకిëదేవి పూజ ఎపðడు పూర్తవుతుందా అని... దీపాలు ఎపðడు పెడతారా అని పెద్ద పని ఉన్నట్లు వీధులోకి పెరట్లోకి తెగ తిరగేసే వాళ్లు... అసలు దీపావళి అంటేనే పిల్లల పండగ కదా మరి ఆ మాత్రం హడావిడి చేయటక పోతే ఎలా అని పెద్దలు చిరునవ్వులు చిందించిన సందర్భాలూ బోలెడు. అమ్మ దీపాలను తెచ్చి పెట్టడం ప్రారంభించి ఆముదం కర్రని వెలిగించి పిల్లల్తో గుమ్మం దగ్గర కొట్టించే వాళ్లు. ఇలా చేస్తే చేతులు కాలిపోవని చెప్పేవాళ్లు నాటి బామ్మ లు. అమ్మ తెచ్చిన దీపాలను ఇంటి ముందు అందంగా వరుస క్రమంలో పెట్టడంలో ఆడ పిల్లలు నిమఘ్నమైతే... దీపం రావటమే ఆలస్యం అన్నట్లు పరుగు పరుగున వెళ్లి దాచిన సామానులన్నీ బైటకు తెచ్చే వాళ్లు మగపిల్లలు. చేతిలో తాట్రేకు టపాకాయ కాల్చడమంటే ఓ అద్భు త సాహస ప్రక్రియే నాడు. మగ పిల్లల్ని ఆడ పిల్లలు కూడా ఫాలో అవుతూ తిట్లు తిన్న సందర్భాలున్నాయి.

మగ పిల్లలు భూ చక్రాలు, చిచ్చు బుడ్లని కాలుస్తూ... తారా జువ్వలని, పిచ్చుకలని, సిసింద్రీలని కాలుస్తుంటే.. తామూ అవి కాలుస్తామని మారం చేసే ఆడ పిల్లల్ని కాకర పువ్వెత్తులని కాల్చమని వారించే వారు పెద్దలు. అన్నీ కాల్చేయాలనున్నా... పౌర్ణమికి, నాగుల చవితికి అంటూ కాసిన్ని తీసి దాచేయటమే కాకుండా... ఎవరెక్కడ ఏం కాల్చుకు ఛస్తారో అనిలోపల భయపడుతునే మరోవైపు పిల్లలు కాలుస్తున్న మందు గుండు వెలుగుల్లో ఆనంద పడుతూ... తన చేతిలో మాత్రం ఓ బర్నాలో, నూనె గిన్నో రడీగా ఉంచుకునే వాళ్లు అమ్మలు.మొత్తానికి దీపావళి నాడు కాల్చాల్సినవన్నీ కాల్చేసినా... ఇంట్లోకి రండి అని నాన్న గద్దింపుతో లోనకొచ్చి... పాముల బిల్లలు వెలిగించి అది బుస బుస మంటుం టే ఆనందించే రోజులవి.

ఇవి కాక గ్రమంలోని యువకులంతా రెండు వర్గాలుగా వీడి పోయి తారా జువ్వలు, సిసింద్రీలు, పిచ్చుకల్ని ఆకాశంలో కాక భూమిపైనే వదులుతూ... పరుగులు తీస్తూ... ఃపల్లిః అంటూ ఓ గ్రామీణ క్రీడని కేవలం దీపావళినాడే అడే వారు. ఇవన్నీ గత తరం ముచ్చట్లు కాగా... నేడు దీపావళి పేరు చెపితేనే చేతులు కాల్చుకోవటం మాట అటుంచి డబ్బులు కాల్చే పండగగానే పరిగణిస్తున్నారు. అణబాంబులు వినియోగిస్తుండగా లేని భయాలు దీపావళి బాగా జరుపుకుని టపాసు లు కాలిస్తే... ఏర్పడే కాలుష్యం పట్ల జనం బెంబెలెత్తేలా ఉపన్యాసాలు దంచిన ప్రభావంతో పాటు పెరగని జీవన ప్రమా ణాలు సైతం పండగ చేసుకోవాలంటేనే ఖర్చెందుకన్న భావన అందరిలో పెరిగి పోయింది.

పోనీ ఇంట్లోనే టపాసులు చేసుకోవ టవెూ... చిచ్చుబుడ్లు కట్టుకోవటవెూ చేద్దామనుకుంటే... అందుకు తగిన ముడి పదార్ధాలు దొరకట్లేదు సరికదా బ్రాండెడ్‌ కొందామంటే గత ఏడాదికన్నా రెట్టింపు ధరలు పెరిగి పోవటంతో... పిల్లల సరదా తీర్చేందుకైనా... ఉన్నంతలో మందుగుండు సామాన్లు కొంత కొని.. ఈ సారి దీపావళి ఏదోలా కానిచ్చేదా మన్న భావన సామాన్య జనంలో ఉంది.

పెట్టుబడులు వచ్చేనా

గత కొన్నేళ్లుగా దీపావళి సామాన్లు అమ్ముతూ వస్తున్నా... ఏనాడూ ఇంతటి పరిస్ధితి చూడలేదు. గతంలో మేం కొన్న ఖరీదుపైనే 50 శాతం ధరలు పెరిగాయి. దీనికి తోడు రవాణా ఖర్చులు, తదితరాలు కల్సి ఈ సారి ధరలు పెరిగాయనే చెప్పాలి. దీంతో మందుగుండు సామాన్ల అమ్మకాలు బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తూ... పెట్టిన పెట్టుబడులు వస్తాయన్న నమ్మకం కూడా కనిపించడంలేదు.

- డి. వెంకటాచారి,

మందుగుండు అమ్మకందారు, ఆనంద్‌బాగ్‌


అపðలు పాలు చేస్తున్న పండగలు

గత నెలంతా బందులు, స్ట్రైకుల వల్ల సంపాదన అంతంత మాత్రమే... వాహనా లు బైటకు పంపాలంటే బాధపడ్డా... సరి కాదా.. ఇంటిని, ట్రావెల్స్‌కి ఖర్చు తడిసి వెూపెడైంది.

ఇపðడు దీపావళి జరపాలంటే... మరింత ఖర్చు పిల్లల సరదాని కాదనలేక... సాంప్ర దాయాన్ని మర్చిపోలేక అపð చేయాల్సి వస్తోంది. ఇక ముందు పండగంటేనే భయపడి పారిపోయేలా పరిస్ధితి తయారవుతోంది. ఇలా అయితే జనం బతికేదెలా

- కృష్ణ, ట్రావెల్‌ ఏజంట్‌

ఆర్‌కె నగర్‌


టీవీల్లో చూడాల్సి వస్తుందేవెూ

నా చిన్న తనం రోజులే గుర్తు తెచ్చుకుని నేటి దీపావళి మనవళ్లతో గడిపేస్తా.. మందుగుండు సామాన్లు కాల్చకుండానే చేతులు కాలే లా ధరలున్నాయి. ఇక ముందు ఎవరైనా దీపావళి జరుపుకుం టుంటే టివిల్లో లైవ్‌ ఇస్తే.. చూసి ఆనందించే రోజులు వచ్చేస్తాయోవెూ అనిపిస్తోంది.

- ఎం.వి. రామశాస్త్రి, ముంగండ, తూర్పుగోదావరి

పండగంటే భయమేస్తోంది

పెరుగుతున్న ధరలే బెంబేలెత్తిస్తున్న దశలో పండగ చేయటమంటే భయమేస్తోంది.ప్రయివేటు ఉద్యోగుల జీతాలు అంతంత మాత్రం. ప్రభుత్వం సంక్షేమం పేరుతో రూపాయికి బియ్యం ఇస్తామని చెప్తూ ... వ్యాట్‌ మాటున నిత్యావసరాల ధరలు మరింత పెంచేసి నడ్డి విరిచేసి, పండగ జరుపుకోనివ్వట్లే.... మేం ఎవ్వరికి చెపðకోవాలి.

- ఎం. సుభద్ర, గృహిణి, వరంగల్‌

వెయ్యికి గుప్పెడు సామాన్లు..

గత ఏడాదే రేట్లు పెరిగాయని అనుకుంటే ఇపðడు సామాన్యుడికి అందుబాటులో లేనంతగా ఎగబాకాయి. వెయ్యి రూపాయలు తీసుకెళ్తే... 10 రకాల సామాన్లు కూడా రాలేదంటే మందుగుండు ధరలు ఎంతలా పెరి గాయో అర్ధం చేసుకోవచ్చు. ఇలానే కొన సాగితే దీపావళి జరుపుకోకుండా మిన్నకుండటమే బెటరని పిస్తోంది.

- శ్రీనివాస్‌, సంకిలి, శ్రీకాకుళం