24, ఫిబ్రవరి 2011, గురువారం

దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి ఫిబ్రవరి 24.

కవి కుటుంబంలో జన్మించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి తన తండ్రి తమ్మన్న శాస్త్రి నుంచి, పెదనాన్న సుబ్బరాయ శాస్త్రి నుంచి కవిత్వం రాయడంలో మెళుకువలు నేర్చుకున్నారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌తో పరిచయం ఆయన కవితా ధోరణిని మార్చింది. ఆకాశవాణిలో 1946లో చేరాక అలవాటుగా రాసేది. తప్పనిసరిగా ప్రోగ్రాముల నిమిత్తం ఎక్కువగా రాయాల్సి వచ్చేసరికి మరోసారి ధోరణి మారింది. చిన్న చిన్న అందమైన పదాలతో అద్భుతంగా అందంగా అర్థాలు వచ్చేలా రాయడం దేవులపల్లి శైలి అయిపోయింది. భావ కవిత్వంకి ఊపిరి పోయడమే కాదు భావకవి ఎలా వుండాలో కూడా ఆయన వేషధారణ తెలిపేది.

సినిమాల్లోకి రప్పించడానికి బి.ఎన్‌.రెడ్డి చాలసార్లు ప్రయత్నించారు. 'దేవత' చిత్రానికి రాయించాలనుకున్న బి.ఎన్‌.రెడ్డి పదేళ్ళ తర్వాత 'మల్లేశ్వరి' లో పాటలు రాయించగలిగారు. మల్లిdశ్వరి పాటలేకాదు కృష్ణశాస్త్రి రాసిన ప్రతిపాట ఆణిముత్యంగానే నిలిచిపోయాయి. అందుకే ఆంధ్రాషెల్లిdగా అభివర్ణించారు శ్రీశ్రీ. పద్మభూషణ్‌ దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి ఫిబ్రవరి 24.