24, ఫిబ్రవరి 2011, గురువారం

మొదటి కొచ్చిన వేణు

కొంతకాలంగా హీరో వేణు కెరీర్‌ మెల్లగా సాగుతోంది. లోగడ ఉన్నంత స్పీడ్‌గా సినిమాలు లేవు. పలు చిత్రాలు తెచ్చిపెట్టిన ఫెయిల్యూర్లే ఇందుకు కారణం. అసలు తనను ఇంతవాణ్ణి చేసింది ఎస్‌.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ. గతంలో ఆ సంస్థ తీసిన 'స్వయంవరం' చిత్రం ద్వారా వేణు హీరోగా పరిచయమయ్యారు. ఇంకా 'చిరునవ్వుతో' వంటి పలు చిత్రాలను ఆ సంస్థ తీసిన విషయం తెలిసిందే.

అయితే చాలాకాలంగా బయటి చిత్రాలు చేస్తూ వస్తున్న వేణుకు ఫెయిల్యూర్లు తలబొప్పి కట్టించాయి. కెరీర్‌ను తిరిగి ఎలాగైనా మలుపు తిప్పుకోవాలని ఆయన ఎంతగానో ఆలోచిస్తున్నారు. తన మాతృసంస్థ ఎస్‌.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఇప్పుడు ఆయన ఓ చిత్రం చేస్తున్నారు. పబ్లిసిటీ లేకుండానే ఈ చిత్ర నిర్మాణం సాగిపోతోంది. వేణు సరసన కమలనీముఖర్జీ నటిస్తోంది. వీరిద్దరూ 'గోపి గోపిక గోదావరి' చిత్రంలో నటించారు. ఈ తాజా చిత్రానికి 'రామాచారి...వీడు...పెద్ద గూఢచారి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.